AAP లోకి ది గ్రేట్ కాళీ ? కేజ్రీవాల్ తో భేటీ

-

డబ్యూ డ్య‌బూ ఈ సూప‌ర్ స్టార్ ది గ్రేట్ కాళీ ఆమ్ ఆద్మి పార్టీ లో చేరుతున్న‌ట్టు తెలుస్తుంది. తాజా గా కాళీ ఢిల్లీ సీఎం , ఏఏపీ జాతీయ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్ తో స‌మావేశం అయ్యాడు. అంతే కాకుండా ఇద్ద‌రం క‌లిసి పంజాబ్ ను మారుస్తాం అంటూ కేజ్రీవాల్ ట్వీట్ కూడా చేశాడు. దీంతో ది గ్రేట్ కాళీ ఆమ్ ఆద్మీ పార్టీ చేరడం ఖ‌య‌మేన‌ని ప‌లువ‌రు అంటున్నారు. కాగ ఈ స‌మావేశంలో కాళీ ఢిల్లీ స‌ర్క‌ర్ పై ప్ర‌శంస‌లు కురిపంచాడ‌ని కేజ్రీవాల్ ట్వీట్ ద్వారా తెలిపాడు.

త‌మ ప్ర‌భుత్వం ఢిల్లీ లో అందిస్తున్న క‌రెంట్, నీరు , స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధి ని చూసి కాళీ మెచ్చు కున్నార‌ని కేజ్రీవాల్ తెలిపారు. కాగ త్వ‌రలో నే పంజాబ్ రాష్ట్రం లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అందు కోసం కేజ్రీవాల్ ఇప్ప‌టి కే 10 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల ను కూడా ప్ర‌క‌టించాడు. అయితే ఈ స‌మావేశం సాధార‌ణ మైన స‌మావేశం అని ఆప్ రాజ‌కీయ నాయకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news