మాజీ సిఎం ఆడియో: ఇరుక్కున్న పోలీసులు

-

అసెంబ్లీ స్పీకర్‌ కు ఎన్నిక సమయంలో ఓటు వేయకుండా ఉండమని కోరుతూ బీహార్‌ లోని ఎన్‌డీఏ ఎమ్మెల్యేలతో టెలిఫోన్ లో మాట్లాడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్‌ యాదవ్ పై దర్యాప్తు జార్ఖండ్ ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. రాంచీ డిప్యూటీ కమిషనర్, పోలీస్ సూపరింటెండెంట్, బిర్సా ముండా జైలు సూపరింటెండెంట్లను విచారించాలని, ఆరోపణలు నిజమని తేలితే చట్టబద్ధమైన చర్యలను ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు.

లాలూ ప్రసాద్ మరియు శాసనసభ్యుల మధ్య జరిగిన సంభాషణ యొక్క ఆడియో క్లిప్‌ ను స్వయంగా విన్న తర్వాత విచారణకు ఆదేశించినట్లు జైలు ఐజి తెలిపారు. జ్యుడీషియల్ కస్టడీ సమయంలో జైలు నిబంధనల ప్రకారం… ఫోన్ లేదా మొబైల్ వాడకాన్ని అనుమతించవని, ఆరోపణలు సరైనవని తేలితే లాలూ ప్రసాద్‌ కు మొబైల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో, దానికి ఎవరు బాధ్యత వహిస్తారో అడిగి తెలుసుకుంటామని భూసన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news