BIG BREAKING : నారా భువ‌నేశ్వ‌రికి క్ష‌మాప‌ణ చెప్పిన‌ వ‌ల్ల‌భ‌నేని వంశి

-

టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు స‌తీమ‌ణి పై వైసీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెను దూమారం లేపాయి. ఏపీ అసెంబ్లీ స‌క్షి గానే నారా భూవ‌నేశ్వ‌రి పై వైసీపీ ఎమ్మెల్యే అస‌భ్య‌కర‌మైన వ్యాఖ్య‌లు చేశారని నంద‌మూరి హీరోలు, అభిమానులు ఆందోళ‌న చేశారు. అయితే ఈ వ్యాఖ్యల పై అధికార వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణికి క్షమాపణలు చెప్పారు.

తాను త‌ప్పు గా మాట్లాడాను అని ఒప్పుకున్నాడు. తాను నారా భువనేశ్వరిపై పొరపాటున ఇలాంటి వ్యాఖ్యలు చేశానని అన్నారు. ఒక ప‌దం త‌ప్పు గా దొర్లింద‌ని తెలిపారు. తాను ఈ త‌ప్పును ఒప్పుకుంటున్నాని తెలిపారు. అలాగే నారా భూవ‌నేశ్వ‌రి కి అంగీకరిస్తూ ఆత్మ సాక్షి గా క్షమాపణలు చెబుతున్నాని అన్నారు. తాను చేసిన అస‌భ్య క‌ర‌మైన వ్యాఖ్యల ప‌ట్ల తానే బాధ‌పడుతున్నాన‌ని అన్నారు. క్ష‌మాప‌ణ చెబితే త‌న‌ను వెలివేస్తార‌నే భ‌యం తో ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేద‌ని అన్నారు.

 

కానీ బాధ రోజు రోజు పెరిగి పోతుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్యలు చేసినందుకు పశ్చాత్తాప ప‌డుతున్నాని వివ‌రించాడు. అయితే త‌న‌కు టీడీపీ లో నారా భువ‌నేశ్వ‌రి చాలా ఆత్మీయురాలు అని తెలిపాడు. నారా భువ‌నేశ్వ‌రి ని అక్క అని పిలుస్తాన‌ని తెలిపాడు. ఈ వివాదంలో అందరూ సంయమనం పాటించాలని కోరారు. మ‌రోసారి త‌న నుంచి ఇలాంటి వ్యాఖ్య‌లు రావ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news