ఏబీఎన్ రాధాకృష్ణపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్..?

-

ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణకూ వైసీపీకీ ఎప్పటి నుంచో పరోక్ష యుద్ధం సాగుతూనే ఉంది. అది కాస్తా ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారిపోయింది. ఇటీవల రాధాకృష్ణ తన కొత్త పలుకు వ్యాసంలో .. క్రిస్టియన్ మత వ్యాప్తి కోసమే జగన్ ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నారని ఏకంగా పెద్ద వ్యాసమే రాశారు.

ఆ వ్యాసం బాగా సంచలనం సృష్టించింది. దానిపై చట్టపరమైన చర్య తీసుకుంటామని వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు కూడా. కానీ ఇప్పటి వరకూ కేసు పెట్టినట్టు లేదు. అయితే ఈ వ్యవహారం ఇప్పటితో ఆగేటట్టు లేదు. పలువురు మంత్రులు ఆంధ్రజ్యోతి పత్రిక తీరుపై విరుచుకుపడుతున్నారు.

లేటెస్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంగ్లీష్ మీడియంపై స్వరం మార్చారు. తాము వ్యతిరేకం కాదని పూర్తి సన్నద్దత లేకుండా చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. దీంతో వైసీపీ మళ్లీ రెచ్చిపోతోంది. గ్ల మీడియంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు యుటర్న్ తీసుకున్న నేపద్యంలో వైసిపి ఎమ్.పి విజయసాయిరెడ్డి ఆంద్రజ్యోతి రాధాకృష్ణ ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు.

ఇంగ్లీష్‌ మీడియం బోధనకు తాను వ్యతిరేకం కాదని కుల పెద్ద చంద్రబాబు నాలుక మడతేశాక కిరసనాయిలు ఏం ‘పలుకు’తాడో. యూదు భాషలో రాసిన బైబిల్‌కు ఇంగ్లిష్‌కు ఏ సంబంధం లేదని సోషల్ మీడియాలో యువత జ్ణానోపదేశం చేశాక అర్థం చేసుకుని ఉంటాడా? ఇంకా చెత్త పలుకులు పేరుస్తూనే ఉంటాడా? అని ఆంధ్రజ్యోతి రాదాకృష్ణను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news