రాష్ట్రంలో కనుమరుగు అవుతుందనే బీజేపీ దాడులు చేస్తోంది: మంత్రి గంగుల కమలాకర్

-

తెలంగాణలో బీజేపీ కనుమరుగు అవుతుందనే అక్కసుతోనే దాడులకు పాల్పడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. నిన్న ఎల్లారెడ్డి పేటలో జరిగిన టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణలపై ఆయన మాట్లాడారు. బండి సంజయ్ ఈ దాడికి ప్రత్యక్షంగా పరోక్షంగా హస్తం ఉందని భావిస్తున్నామని… ఒక వేళ మీ హస్తం లేకపోతే మీరు ఈ ఘటనపై యాక్షన్ తీసుకోవాలని.. దాడిని ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే దాడులే మా విధానం అని చెప్పండి అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడుల జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని గంగుల కమలాకర్ హెచ్చరించారు. 

రౌడీలు, గుండాల పార్టీల్లో ఉండలేమని కరీంనగర్ బీజేీపీ కార్పొరేట్లు టీాఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని.. బండి సంజయ్ కి మతి భ్రమించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దుయ్యబట్టారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో అలజడి కలిగించేందుకు ఈ దాడులు చేస్తోందని రసమయి అన్నారు. నిన్నటి ఎల్లారెడ్డి పేట దాడికి బండి సంజయ్ బాధ్యుడని ఆయన ఆరోపించారు. బీజేపీ వాళ్లు పడికెడు ఉన్నారని.. మేం పుట్టెడు ఉన్నాం అని మేమే కనుక దాడులు చేస్తే తునక కూడా కనిపించదని హెచ్చరించారు. బుల్డోజర్లు వచ్చే లోపే బీజేపీని పాతాళంలోకి తొక్కేస్తామని రసమయి అన్నారు.  టీఆర్ఎస్పై బీజేవైఎం చేసిన అనుచిత పోస్ట్ తో  నిన్న బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news