అధికారం శాశ్వతం కాదు.. పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు !

-

ఖమ్మం జిల్లా వేంసూర్ మండల పర్యటనలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కార్యక్రమాలకు వస్తున్న ప్రజా ప్రతినిధుల పై కక్ష్య పూరితం గా వ్యవహరిస్తున్నారన్న అయన అధికారం శాశ్వతం కాదు, నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అధైర్య పాడల్సిన అవసరం లేదని అన్నారు. నేడు పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ టిఆర్ఎస్ చెట్టు నీడలో ఉన్నవారేనని అన్నారు.

ప్రజా అభిమానమే మాకు చాలా పెద్ద పదవులు… పదవి రావాలి అన్నప్పుడు పదవిని భగవంతుడు మాకు ఇవ్వాలి అన్నప్పుడు ఎవరు అడ్డుపడ్డ ఆ పదవి ఆగదని అన్నారు. పదవి  పోయే టైం వచ్చినప్పుడు ఎవరు అడ్డు పడ్డా ఆగదని అన్నారు. ఇది చెప్పేది వేదాంతం కోసం కాదన్న ఆయన పదవులు ఎవడబ్బ సొత్తు కాదని నేను మొదటినుంచి చెప్తున్నా అని అన్నారు. ప్రజల ప్రేమ అభిమానం మన అబ్బ సొత్తు అని ఆయన అన్నారు. మనం నమ్ముకున్న ప్రజలు ఆ టైం వచ్చినప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలి అనుకుంటే అది  ఇస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news