పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర మంత్రిగా కొనసాగే అర్హత లేదు..ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

యూరో ఎగ్జిన్ బ్యాంకు కుంభకోణంలో మంత్రి పొంగులేటి కంపెనీ భాగస్వామి అంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.సోమవారం అసెంబ్లీ మీడియా హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై ఈ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్ బ్యాంకు లేదని.. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఉల్లగించి నడుపుతూ మోసం చేశారని ఆయన అన్నారు.

రాష్ట్ర మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు.వెంటనే యూరో ఎగ్జిన్ బ్యాంక్ గ్యారంటీలపై విచారణ జరిపించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఈ కుంభకోణంలోని గుత్తేదారుల పేర్లు తాను త్వరలోనే బయటపెడతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news