దమ్ముంటే ఆ పని చెయ్యండి: పొన్నం

-

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఒకపక్క ప్రచారంతో హోరెత్తిస్తే ఇంకోపక్క ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతున్నారు. నేతల విమర్శలు సవాళ్లు తో ఎన్నికల ముందే పొలిటికల్ వెదర్ హీటెక్కి పోతోంది. పొన్నం ప్రభాకర్ బీజేపీ మీద మండిపడ్డారు.

శుక్రవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విపక్షాలని అణగదొక్కాలని బిజెపి ప్రయత్నం చేస్తోంది అని అన్నారు అధికారం అడ్డం పెట్టుకుని సిబిఐ ఈడీలతోనే బిజెపి పాలిస్తోందని ఫైర్ అయ్యారు. రాముడిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని బిజెపి నేతల మీద సీరియస్ అయ్యారు రాముడి అక్షింతలు ఫోటోలు ఇచ్చి ఓట్లు అడగడం దారుణమని దమ్ముంటే ప్రధాని మోడీ ఫోటో పెట్టుకుని ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news