కాళేశ్వరం గురించి అందుకే బీజేపీ మాట్లాడట్లేదు: పొన్నం

-

కాళేశ్వరం అవినీతి మీద బిజెపి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం పై కారణాలు బయటపెడుతూ తెలంగాణ బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ట్విట్ చేశారు. కాళేశ్వరంఅవినీతి మీద బిజెపి ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా అని ప్రశ్నించిన ఆయన లక్ష కోట్ల కాలేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ కంపెనీ బిజెపికి మెగా డొనేషన్ ఇచ్చిందని ఎన్నికల బాండ్ల రూపం లో బీజేపీకి 1000 కోట్ల చందా ఇచ్చిందని అన్నారు.

ఇందులో లక్ష కోట్ల గోదావరి పాలైతే 1000 కోట్లు బిజెపి పాలయ్యాయని అన్నారు అంతే కాకుండా బీజేపీ చెప్పేది పేరుకే అవినీతి యుద్ధం చేసేది వసూళ్ల పర్వం అని సెటైర్లు వేశారు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీలకీ డొనేషన్ల రూపంలో వచ్చిన లెక్కలు డొనేషన్లు ఇచ్చిన కంపెనీ ఫోటోలని పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news