రేషన్ కార్డులపై పొన్నం కీలక ప్రకటన..!

-

కొత్త రేషన్ కార్డుల మీద మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ ని పర్యటించారు. అయితే ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ లకి ఓటు వేసి వృధా చేసుకోవద్దని ఓటర్లకి ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కరీంనగర్ కి ఆ రెండు పార్టీలు చేసేదేమీ లేదని అన్నారు.

కరీంనగర్ అభివృద్ధికి తను సిద్ధమని బండి సంజయ్ బోయినపల్లి వినోద్ కుమార్ సిద్ధమ అంటూ సవాల్ చేశారు అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయని శుభవార్త చెప్పారు పొన్నం. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రక్రియని ప్రారంభిస్తామని చెప్పారు వచ్చే ఆగస్టు 15వ తేదీ లోపు రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే వానకాలం పంటకి 500 ఇస్తామని భరోసాని ఇచ్చారు రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ అంటేనే రైతులు అని పొన్నం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news