నార్కో టెస్ట్ కి సిద్ధమా..? చంద్రబాబు కి పోసాని సవాల్..!

-

టీడీపీ చీఫ్ మాజీ సీఎం చంద్రబాబు మీద ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన కామెంట్స్ చేశారు. హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కాదని మోహన్ బాబు నుండి ఆయన దానిని లాక్కున్నారని అన్నారు. కాపు డైనమిక్ లీడర్ వంగవీటి రంగ ని హత్య చేయించింది చంద్రబాబు అని పబ్లిక్ డొమైన్ లో ఉందని అన్నారు.

ఈ విషయం నిజం కాదని చంద్రబాబు నార్కో టెస్ట్ కి సిద్ధమా అని సవాల్ విసిరారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు టీడీపీ కార్యకర్త కూడా కాదని ఆ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచే టిడిపిని లాక్కున్నారని అన్నారు పోసాని.

Read more RELATED
Recommended to you

Latest news