ఎన్టీఆర్ కూరలో కరివేపాకు.. పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు !

-

చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉంటూ అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని పోసాని కృష్ణ మురళి అన్నారు. ఎవరికీ మింగుడు పడని విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారుని, చంద్రబాబు నాయుడే ఫేక్ ముఖ్యమంత్రని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు సీఎం అయ్యారని, చంద్రబాబు నీచంగా మోసాలు చేస్తారని అన్నారు. ద్రబాబుకు పదవిపై పిచ్చని ఎన్టీఆర్ ను కరివేపాకులా వాడుకుని వదిలేసారని అన్నారు. ప్రజలు చంద్రబాబు పై తిరగబడాలని, రాజధాని ప్రాంత రైతులు ఎవరి మాటలు విని ప్రభుత్వంపై వ్యతిరేకత, కక్ష పెంచుకున్నారు ? అని ప్రశ్నించారు.

ఎప్పుడూ సీఎం సీట్లో కూర్చోవాలనే చంద్రబాబు ఆరాటపడుతున్నారని చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం అని అన్నారు. జగన్ ఎలా అవినీతి పరుడో నిరూపించాని జగన్ను అవినీతి పరుడని నిరూపిస్తే తాను చంద్రబాబు కాళ్లకు దండం పెట్టి ఫొటో మెడలో వేసుకుని రాష్ట్రమంతా తిరుగుతానని అన్నారు. అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రజలను చంద్రబాబు  రెచ్చగొడుతున్నారని అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే మద్దతివ్వాలని అన్నారు. జగనులో ఉన్న సుగుణాలు నాకు నచ్చే నేను మద్దతిస్తున్నానని అన్నారు. నేను పదవుల కోసమో,పనుల కోసమో జగన్ కు మద్దతివ్వలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news