ఖమ్మంలో కరోనా కల్లోలం.. ఒకే పాఠశాలలో 13 మంది విద్యార్థులకు పాజిటివ్

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ మహమ్మారి ప్రభావం స్పష్టం కనిపిస్తోంది. ప్రతి రోజూ… తెలంగాణ రాష్ట్రంలో… 200లకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే.. తాజాగా ఖమ్మం జిల్లా వైరా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఏకంగా…  వైరా గురుకుల పాఠశాల లో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

650 మంది విద్యార్థులకు కరోనా వైద్య పరీక్షలు చేయగా… ఇందులో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా… పాఠశాల అధికారులు ప్రకటన చేశారు. ప్రస్తుతం.. ఆ 13 మంది విద్యార్థులను క్వారంటైన్‌ కు తరలించామని… అలాగే వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఆ 13 మంది విద్యార్థులకు సన్నిహితంగా ఉన్న వారికి మరో సారి ప్రత్యేకం గా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news