తనను కాదన్నాడని యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి… కేరళలో ఘటన

-

ప్రేమ పేరుతో అమ్మాయిలను హతమార్చడం… యాసిడ్ దాడులు చేయడం చూశాం.. కానీ జస్ట్ ఫర్ చేంజ్ ఈసారి ఓ యువతి యువకుడిపై యాసిడ్ చేసి గాయాలపాలయ్యేలా చేసింది. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. అనను కాదన్నాడనే అక్కసుతో వ్యక్తిపై దాడి చేసి అతని కంటిచూపు పోయేలా చేసింది.

వివరాల్లోకి వెళితే… తిరువనంతపురంలో నర్సుగా పనిచేస్తున్న 36 ఏళ్ల షీబాకు మూడేళ్ల క్రితం ఫేస్ బుక్ లో అరుణ్ కుమార్ అనే వ్యక్తి పరిచమయ్యాడు. కొన్నాళ్లు దగ్గరగా వీరిద్దరు దగ్గరగా ఉన్నారు. అయితే ఇటీవల షీబాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి అరుణ్ కుమార్ ఆమెకు దూరమయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందుకోసం ఇతర మహిళలతో చనువుగా ఉంటున్నాడు. ఇది తెలిసి షీబా అరుణ్ కుమార్పై కసి పెంచుకుంది.

ఈ క్రమంలోనే మాట్లాడేది ఉందంటూ షీబా, అరుణ్ కుమార్ను స్థానికంగా ఉండే చర్చికి రమ్మంది. అక్కడికి వచ్చిన అరుణ్ కుమార్ పై తనతో తెచ్చుకున్న యాసిత్ తో దాడి చేసింది. అరుణ్ కుమార్ ముఖం పై యాసిడ్ దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అదే సమయంలో షీబాపై కూడా యాసిడ్ పడటంతో గాయాలపాలైంది. తీవ్రంగా గాయపడ్డ అరుణ్ కుమార్ ఒక కంటి చూపును కోల్పోయాడు. ప్రస్తుతం బాధితుడు తిరువనంతపురం మెడికల్ కాలేజీలో వైద్యం పొందుతున్నాడు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news