దరిద్రం ఆ మహిళను నిలువునా వెంటాడింది…!

-

కర్ణాటక రాజధాని బెంగళూరులో చిన్న తప్పు ఒక మహిళ నిండు ప్రాణాలను తీసింది. అసలు ఏం జరిగిందో స్టోరీలోకి వెళ్తే… బెంగళూరులోని సదాశివనగర్‌ లోబుధవారం… నందిని రావు అనే మహిళా ఐటి ఉద్యోగి తన కొడుకును ఆడిస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసి ఉన్న కారు డోర్ తీసింది. అయితే రివర్స్‌ గేర్‌లో నిలిపిన విషయం ఆమెకు గుర్తు లేదు.

అందులో ఎక్కబోవడం, ఆ తర్వాత కారు వెనక్కు కదలడం, ఆ వెనుకనే పెద్ద చెట్టు ఉండటంతో కారు తలుపుకి చెట్టుకి మధ్య ఆమె ఇరుక్కుపోయింది. కాపాడమని అరిచింది… వెంటనే స్థానికులు వచ్చి ఆమెను రక్షించి బయటకు తీయగా అప్పటికే తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు`

Read more RELATED
Recommended to you

Latest news