దరిద్రం అంటే ఇదే గురూ… శనివారం పుట్టిన రోజు…!

-

విజయవాడ వన్ టౌన్ లో నాలుగేళ్ల‌ బాలుడు మృతి చెందిన ఘటన కన్నీరు పెట్టిస్తుంది. తమ ఇంటి డాబా పై ఆడుకుంటూ… వాటర్ ట్యాంకులో పడిన బాలుడు… ఆలస్యం గా గుర్తించడంతో ప్రాణాలు కోల్పోయాడు. శనివారం బాలుడి పుట్టిన రోజు చేసేందుకు ఏర్పాట్లు‌ చేసారు తల్లి తండ్రులు… తల్లి ఎనిమిది నెలల గర్భవతి కూడా. ఇటీవల తన తల్లి తండ్రులతో మాట్లాడుతూ… త్వరలో తమ్ముడో, చెల్లితో ఆడుకుంటాను అంటూ బాలుడు మాట్లాడాడు.

అతని బాలుడి మాటలను గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన చుట్టుపక్కల వారిని కలచి వేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు ఏ విధంగా ట్యాంక్ లో పడ్డాడు అనేది తల్లి తండ్రులకు కూడా అర్ధం కావడం లేదు. పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news