హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఇవాళ ఈ ప్రాంతాల్లో పవర్ కట్ !

-

హైదరాబాద్ మహానగర ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ నగరంలోని ఆదర్శనగర్, బిర్లా మందిర్, ఎస్బిఐ, ఈఎస్ఐ, జలమండలి, నిజాం కళాశాల ఫీడర్ లో, భారతీయ విద్యా భవన్, హైలెట్ చౌరస్తా, కింగ్ కోటి ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు విద్యుత్ నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

అలాగే ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతం, లుంబిని పార్క్ ఎదుటి ప్రాంతం, లుంబిని పార్క్, ఎల్బీ స్టేడియం మెయిన్ రోడ్డు, నిజాం హాస్టల్, జగదాంబ జ్యువెలర్స్ బిల్డింగ్ తదితర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బి జె ఆర్ కాలనీ, రామానాయుడు స్టూడియో ప్రాంతం, మధురానగర్, యూసఫ్ గూడా, దేవరాయ నగర్ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విద్యుత్ నిలిపి వేస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news