మళ్ళీ మనసు మార్చుకున్న ప్రభాస్.. కష్టమేనట !

-

ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు అనౌన్స్ చేసి బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కుతోన్న పీరియాడిక్ లవ్ స్టోరీ రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోండగా జిల్ ఫేం రాధా కృష్ణ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూట్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ఈ సినిమా తరువాత ఆయన అనౌన్స్ చేసిన రెండు సినిమాలు అంటే ఒకటి నాగ్ అశ్విన్ సినిమా, మరొకటి ఓం రౌత్ తో ఆది పురుష్.

ఈ రెండు సినిమాలు ఒకే సమయాన అంటే ప్యారలల్ గా షూట్ చేయనున్నాడని ప్రచారం జరిగింది. దీని కోసం ఆయన కేవలం హైర్ స్టైల్ మారిస్తే సరిపోతుందని అన్నారు. అయితే ఇప్పుడు అలా ఏమీ రిస్క్ తీసుకోవడం లేదని అంటున్నారు ప్రభాస్ సన్నిహితులు. రాధేశ్యామ్ సినిమా పూర్తి చేశాక ముందు ఆదిపురుష్ సినిమా చేస్తారని, అది చాలా తక్కువ వ్యవధిలోనే పూర్తి చేసేసి అప్పుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవుతాడని అంటున్నారు. ఇక ఆది పురుష్ అంతా గ్రీన్ మ్యాట్ మీదనే ఉంటుందని, అందుకే షూట్ పార్ట్ కి ఎక్కువ సమయం తీసుకోదని అంటున్నారు. అయితే మా హీరో రెండు సినిమలు ఒకేసారి షూట్ చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తాడని భావించిన అభిమానులు మాత్రం ఈ వార్త తెలిసి బాధ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news