“రాధేశ్యామ్” అట్టర్ ఫ్లాప్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్మహత్య !

-

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా రాధేశ్యామ్. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను… టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కింది. అయితే ఈ సినిమా మొన్న థియేటర్లలో విడుదల అయింది. ప్రభాస్‌ సినిమా కావడంతో.. కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా 7000 కు పైగా స్క్రీన్స్‌ లో విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్‌ అదుర్స్‌ అనిపిస్తున్నాయి. ప్రభాస్‌ కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా విడుదలకు ముందుగానే ఆన్‌ లైన్‌ టికెట్స్‌ బాగా అమ్ముడయ్యాయి. యూఎస్‌ ప్రీమియర్‌ షోస్‌ ద్వార 891k డాలర్స్‌ వచ్చాయని సమాచారం.
అయితే రాధేశ్యాం సినిమా మంచి కలెక్షన్ రాబట్టినప్పటికీ…. చాలా చోట్ల మిక్స్ డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో మాస్ హీరోగా పేరున్న ప్రభాస్ లవ్ స్టోరీ చేయడం, క్యాన్సర్ ను అలరించే కమర్షియల్ అంశాలు ఏవీ లేకపోవడం తో ఈ సినిమా పై విమర్శలు వస్తున్నాయి.

సినిమా బోర్ కొట్టింది అంటూ చాలామంది అంటున్నారు. అయితే ఈ సినిమా పై నెగిటివ్ టాక్ రావడంతో… ప్రభాస్ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా తిలక్ నగర్ లో నివాసముండే రవితేజ సినిమా బాగాలేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లితో చెప్పి మరీ రవితేజ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. జై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news