RADHESHYAM : ప్రీ రిలీజ్ ఈవెంట్లో గాయపడిన అభిమానులకు ప్రభాస్ సాయం

-

టాలీవుడ్ యంగ్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసున్న చాటుకున్నాడు. ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా రాధే శ్యామ్. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నాలుగు రోజుల క్రితం రామోజీ ఫిలిం సిటీ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్ ఫ్యాన్స్ వేలాదిగా తరలివచ్చారు.

ఈ ఫంక్షన్ చాలా విజయవంతంగా సాగినప్పటికీ… ఓ విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు కటౌట్ కిందపడి ముగ్గురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే గాయపడ్డ వారి గురించి తెలుసుకున్న ప్రభాసు వారికి ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం అందుతోంది. ఇది వరకు ఎన్ని సార్లు కష్టాల్లో ఉన్న తన ఫ్యాన్స్ ను ఆదుకున్న ప్రభాస్ తాజాగా రిలీజ్ ఈవెంట్ లో గాయపడ్డ వారికి ఆర్థిక సహాయం చేశారు. దీంతో ప్రభాస్ పై ఆయన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version