ప్రభాస్21.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

-

ప్రభాస్.. ప్రస్తుతం భారత సినీ పరిశ్రమకు ఓ ఐకాన్. దేశవిదేశాల్లో అతని అభిమానులున్నారు. బాహుబలి, సాహో చిత్రాలు ప్రభాస్ ఇమేజ్‌ను మార్చేశాయి. టాలీవుడ్ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగాడు. ప్రభాస్ సినిమా వస్తోందంటే.. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అందుకే ప్రభాస్ సినిమాలను ప్రస్తుతం ప్యాన్ ఇండియాగా తెరకెక్కిస్తున్నారు.

అందులో భాగంగానే జిల్ ఫేమ్ రాధాకృష్ణతో తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. రాధే శ్యామ్, ఓ డియర్ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇవన్నీ పక్కన బెడితే.. ప్రభాస్ 21వ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. వైజయంతీ సంస్థలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రభాస్ ప్రకటించేశాడు.

మహానటి తరువాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం కాబట్టి అందరి అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అందుకే తగ్గట్టే నాగ్ అశ్విన్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ కథను కేవలం ప్రభాస్ మాత్రమే మోయగలడని, ఇది ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మూవీ కోసం ప్రభాస్ తీసుకునే రెమ్యూనరేషన్‌పై పెద్ద ఎత్తున ప్రచారం జరగుతోంది. పారితోషికంగా 70కోట్లు అందుకుంటున్నాడని, మళ్లీ లాభాల్లో కూడా వాటా ఉందని టాక్ నడుస్తోంది. ఈ లెక్కన మొత్తం వంద కోట్లు దాటుతుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news