ప్రభాస్‌ సినిమాని డైరెక్ట్‌ చేస్తా: పృథ్వీరాజ్‌ సుకుమారన్

-

హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘ఆడుజీవితం’ సినిమాతో మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను బ్లెస్సీ తెరకెక్కించారు. హిందీ, తమిళ, కన్నడ,తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ ”మంచి కథ కుదిరితే టాలీవుడ్‌లోనూ హీరోగా నటిస్తా అని తెలిపారు. దర్శకుడిగా చేయాల్సి వస్తే ప్రభాస్‌తో సినిమా చేస్తా అని పేర్కొన్నారు.ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. దేశవ్యాప్తంగా ప్రభాస్కు చాలామంది అభిమానులు ఉన్నప్పటికీ కూడా అతను ఎప్పుడు గర్వం చూపించలేదని అన్నారు. అందిరితో చాలా ప్రేమగా మాట్లాడుతారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది” అని తెలిపారు. ‘సలార్‌’ చిత్రంలో స్నేహితులుగా వీరిద్దరి చిన్నప్పటి సన్నివేశాలతో క్రియేట్‌ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లా వైరల్‌ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news