ప్రగ్యా జైస్వాల్ పరువాలు.. ఏంటీ ఈ అందాల దాడి

-

ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత నటనపై ఉన్న మక్కువతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ బ్యూటీ కి ఆరంభం నుంచి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వరుణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన `కంచె` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు.

ఇక ఈ భామ గతేడాది హీరోయిన్‌గా నటించిన అఖండలో బాలకృష్ణకు జోడి కట్టింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా అన్ని అంచనాలను అందుకుని బాలయ్యకు మంచి విజయాన్ని అందించింది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రగ్యాకు కూడా మంచి విజయం దక్కింది. దీంతో తెగ ఎంజాయ్ చేస్తోంది భామ. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది.

1991 జనవరి 12న జన్మించిన ఈమె ముందుగా కొన్ని యాడ్ ఫిల్మ్స్‌లో నటించింది. 2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు/ డేగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో పరిచయమైంది. తొలి సినిమాతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు కైవసం చేసుకుంది. హిందీలో టిటూ MBA సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె తెలుగులో కంచె తర్వాత చేసిన ‘నక్షత్రం’ (2017), మంచు విష్ణుతో చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలు ఈమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి.

గతేడాది బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’లో IAS ఆఫీసర్‌గా నటించింది. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చేసింది. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది . ప్రగ్యా జైస్వాల్ పూణెలోని సింబిసిస్ లా స్కూల్‌లో చదువుకుంది. కాలేజీలో అందాల పోటీల్లో పాల్గొని అక్కడ కూడా సత్తా చాటింది. ఇక అఖండ సక్సెస్ అయినా.. ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్లింది. ప్రగ్యాకు పెద్ద ఒరిగిందేమి లేదు. ఈ సినిమా సక్సెస్ అయినా.. అవకాశాల కోసం ఈమె ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.

ప్రగ్యా జైస్వాల్ హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాలో నటించింది. అటు నాగార్జున, కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన ఓం నమో వేంటటేశాయ’ సినిమాల్లో నటించింది. ఈ యేడాది మోహన్ బాబు హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలో NIA ఆఫీసర్ పాత్రలో మెరిసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news