ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..

-

పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు వస్తుండడంతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 4,39,975 గా ఉంది. అటు ఔట్ ఫ్లో 4.28,120క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వరద నీరు మరింత పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చారు. వరద ప్రవాహం మరింత పెరనున్న కారణంగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన ఉన్న ప్రజలను అప్రమత్తం చేసారు.

క్రిష్ణా , గుంటూరు జిల్లా వాసులు అలర్ట్ గా ఉండాలని, మద్దిగూడెం, చింతమోటు, పెదలంక, పెసర్లంక ఓలేరు, పల్లిపాలెం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అటు జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంతో పాటు కావాల్సిన వాటిని సమకూర్చాలని, ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news