పుష్ప సినిమా పై బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్..!

-

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రసారమవుతోంది. ఈ సినిమా కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రతి భాషలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ లో జరిగిన బీజేపీ జనాగ్రహ సభలో బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను వచ్చేటప్పుడు సినిమా పోస్టర్ చూశానని.. సినిమాకి వెళ్తాను అని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి సినిమాలో చూపించారని తెలిపారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధానికి వేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను రద్దు చేశారని ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ఇక ప్రకాశ్ జవదేకర్ చేసిన కామెంట్లతో పుష్ప కు మరింత పబ్లిసిటీ పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news