డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ మరోసారి విమర్శలు

-

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వాణిని చాలా బలంగా వినిపిస్తున్నారు. సనాతన ధర్మం జోలికి ఎవరూ రాకూడదని హెచ్చరించారు.గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చాలా అక్రమాలు జరిగాయని ఆరోపించారు.పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న క్రమంలో నటుడు ప్రకాశ్ రాజ్ ఆయన్ను కార్నర్ చేసి సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.

‘జస్ట్ ఆస్కింగ్’ పేరిట పవన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.తాజాగా మరోసారి ఏపీ డిప్యూటీ సీఎంపై పరోక్షంగా ఆయన ఘాటు విమర్శలు చేశారు.ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..‘తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతున్నారు.మరొక సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.మాది సమానత్వం.నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారు.నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరఫున మాట్లాడతా’అని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు.ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news