ప్రణయ్ మళ్లీ పుట్టాడు…పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమృత

-

ప్రణయ్ – అమృతల పేరు వినగానే గుర్తోచ్చేది..మిర్యాలగూడలోని సంచలనం రేకెత్తించిన ప్రణయ్ పరువు హత్య.. అయితే ఇప్పుడు ఆ కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తోంది. ప్రణయ్ భార్య అమృత పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది.  పరువు హత్యలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్ మరో సారి జన్మించాడు అంటూ వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మిర్యాలగూడలో గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్, అమృత కక్ష పెంచుకొని.. ఆమె తండ్రి మారుతీరావే కిరాయి హంతకులతో దారుణంగా ప్రణయ్‌ని హత్య చేయించిన విషయం తెలిసిందే.

ఇన్నాళ్లూ ప్రతి క్షణం ప్రణయ్‌ని తలచుకొని… కన్నీళ్ల సంద్రంలో బతికిన అమృత… తనకు పుట్టిన పసికందును చూసి..ఆనందం వ్యక్తం చేస్తోంది. తన మాట వినకుండ అమృత కులాంతర వివాహం చేసుకుందని ప్రణయ్‌ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించడమే కాకుండా…తానే చంపించినట్లు మీడియా, పోలీసుల ముందు ఒప్పుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ ని హత్య చేయడంతో తన తండ్రిని సైతం లెక్కచేయని అమృత నాటి నుంచి నేటి వరకు ప్రణయ్ కుటుంబ సభ్యులతోనే గడుపుతోంది. దీంతో ఆమెకు మగబిడ్డ పుట్టడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు వచ్చి పరామర్శించడంతో హాస్పిటల్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news