నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం.. అందుకోసమేనా..?

-

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారంలో కొనసాగేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పాదాలను తాకుతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. జన్ సూరజ్ ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన సభలో కిషోర్ ప్రసంగిస్తూ.. “ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇక పై ఏది చేయాలనుకున్నా నితీష్ కుమార్ ఆదేశించాలని కొన్ని రోజుల క్రితం దేశం చూసింది. నితీష్ కుమార్ వద్దనుకుంటే దేశంలో ప్రభుత్వం ఏర్పడదు.

నితీష్ కుమార్ చేతిలో చాలా అధికారం ఉంది. దానికి ప్రతిగా నితీష్ కుమార్ ఏమి అడిగారు? బీహార్ పిల్లలకు ఉపాధి కల్పించాలని అడగలేదు. బీహార్ జిల్లాల్లో చక్కెర కర్మాగారాలు పనిచేయాలని డిమాండ్ చేయలేదు. బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేయలేదు. 2025 తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిగా ఉండాలని, దీనికి బీజేపీ కూడా మద్దతివ్వాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. బీహార్ ప్రజలందరి గౌరవాన్ని అమ్మేశాడు” అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news