ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైన యాత్ర 2

-

దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో తమిళ నటుడు జీవ వైఎస్ జగన్ పాత్రలో నటించిన చిత్రం యాత్ర 2. ఇదివరకే 2019 ఎలక్షన్స్ కి ముందు యాత్ర సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రము మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక కలిసి నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలై మంచి రివ్యూస్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు దాని ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ఈ సినిమా 12 ఏప్రిల్ లేదా 19 ఏప్రిల్ ఓటీటీ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. రాజశేఖర్ రెడ్డి మరణం ముందు, తర్వాత జగన్ పరిస్థితులు, ఆ తరువాత జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారు అనే విషయాలను ఈ చిత్రం లో చూపించారు.

Read more RELATED
Recommended to you

Latest news