టీడీపీలో చేరిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు

-

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ లో చేరారు. చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చొరవతోనే మళ్లీ ప్రజల ముందుకొచ్చానని రఘురామ తెలిపారు. చంద్రబాబు, ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. జూన్ 4న కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని జోస్యం చెప్పారు.

రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలనలో ఏమైనా సాధించారా అని ప్రశ్నించారు. యువకుల జీవితాలను అంధకారం చేశారని విమర్శించారు. ఆయన పాలనలో అన్ని వర్గాలు నాశనం అయ్యాయని చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news