ఏపీలోని పుంగనూరు ఆవులకు కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డు

-

ఏపీలోని పుంగనూరు ఆవులకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా పలమనేరులోని పుంగనూరు పరిశోధన కేంద్రానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2022 లభించింది.

జాతీయస్థాయిలో అరుదైన, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషి చేసే సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఏటా ఈ అవార్డులను ప్రధానం చేస్తుంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డు కింద ప్రత్యేక ప్రశంసపత్రంతో పాటు నగదు బహుమతిని ప్రధానం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news