అరుదైన రికార్డుని అందుకున్న ప్రిన్స్ మహేష్..!!

-

మహేశ్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇప్పటికి 40 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా యంగ్ హీరోల కంటే ఎక్కువ గ్లామర్ మెయింటైన్ చేస్తూ వుంటాడు. మహేష్ కు అభిమానులలో పురుషుల కంటే మహిళలేదే పై చేయి. కాలేజీ అమ్మయి లలో  మహేశ్ పట్ల విపరీతమైన క్రేజ్ వుంది. మామూలు సినిమాలను కూడా తన చరిష్మా తో హిట్ చేయగల సామర్థ్యం కలిగిన హీరో మహేష్.

తాజాగా ఆయన ట్విట్టర్  అద్భుతమైన రికార్డు సాధించారు. ప్రస్తుతం మహేష్ బాబు కు ట్విట్టర్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మహేష్ బాబు అభిమానులు హంగామా చేస్తున్నారు. ట్విట్టర్ లో  మహేష్ తన కుటుంబంతో కలిసి గడిపిన ఫోటోస్ ను , తన సినిమా సమాచారం ను అభిమానుల తో తరచుగా పంచుకుంటూ వుంటారు

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు.అతడు-ఖలేజా తర్వాత మహేష్- త్రివిక్రమ్ జోడీకి హ్యాట్రిక్ చిత్రమిది.   త్రివిక్రమ్ ఇప్పుడు ఈ సినిమా ను పాన్ ఇండియా సినిమా స్థాయిలో  తెరకెక్కించనున్నారు.ఈ సినిమా తర్వాత మహేష్  నెక్స్ట్ సినిమా దిగ్గజ దర్శకుడు రాజమౌళి తో ఉండనుంది.అదెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news