పాఠశాలకు మహిళా టీచర్ ఆలస్యంగా వచ్చిందని ప్రిన్సిపల్ దాడి.. వీడియో వైరల్

-

ఉత్తర ప్రదేశ్ లో ఒక ప్రిన్సిపల్ చిన్నపాటి విషయానికి ఉపాధ్యాయురాలు పై దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లఖింపూర్ కేరి లోని మహేంగు ఖేరా అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో అజిత్ వర్మ ప్రిన్సిపల్ గా పని చేస్తున్నాడు. అయితే పాఠశాలకు ఒక మహిళా టీచర్ ఆలస్యంగా వచ్చిందని ప్రిన్సిపల్ అందరి ముందే రెచ్చిపోయాడు. టీచర్ ను బూటు తీసుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు.

దీంతో అక్కడే ఉన్న తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత ఉపాధ్యాయురాలు కూడా ప్రిన్సిపాల్ ని కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్.. అజిత్ వర్మను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీకాంత్ పాండే తెలిపారు. అయితే దీనిపై ప్రిన్సిపాల్ వాదన మరో విధంగా ఉంది. సదరు ఉపాధ్యాయురాలు రోజు కావాలనే ఆలస్యంగా వస్తుందని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news