Priyanka Gandhi : ఆసుపత్రిలో చేరిన ప్రియాంక గాంధీ వాద్రా

-

ప్రియాంక గాంధీ : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరానని ఆమె స్వయంగా ప్రకటించింది. అందువల్ల ఈరోజు భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర లో పాల్గొనలేనంటూ ట్వీట్‌ చేసింది. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్‌కు చేరుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ అనారోగ్యం కారణంగా ఈరోజు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

నా ఆరోగ్యం కుదుట పడగానే యాత్రలో చేరుతాననీ అన్నారు. ప్రియాంక గాంధీ సోదరుడు ,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ఇవాళ సాయంత్రం బీహార్‌ రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఇవాళ యాత్ర యూపీలో ప్రవేశిస్తున్న సందర్భంగా తన సోదరుడు రాహుల్ గాంధీకి, ఇతర కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపింది.రాహుల్ గాంధీ యాత్ర యూపీలోకి ప్రవేశించే సమయంలో ప్రియాంక గాంధీ స్వాగతం పలకాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news