యూట్యూబ్ ను షేక్ చేసిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్

-

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’.సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది .అయితే ఇందులోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ వంద మిలియన్ల క్లబ్లో చేరింది. యూట్యూబ్లో ఈ సాంగ్ లిరికల్ వీడియోకు 100 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సాంగ్పై సోషల్ మీడియాలోనూ లక్షల కొద్ది రీల్స్ పుట్టుకొస్తున్నాయి. ‘గుంటూరు కారం’ మూవీ తాజాగా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా రమ్యకృష్ణ, జయరాం,మురళి శర్మ, ప్రకాష్ రాజ్, ఈశ్వరరావు,వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. హారిక అండ్ హసన్ క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Read more RELATED
Recommended to you

Latest news