ఆమెకు మాట ఇచ్చా..నాకు విడాకులు వద్దు.. రమ్య రఘుపతి..!!

-

రమ్య రఘుపతి.. సీనియర్ నటుడు నరేష్ ఒక మంచి మనసున్న వ్యక్తిత్వం కలవాడు అని పవిత్ర లోకేష్ అంటే.. నరేష్ మాత్రం మంచివాడు కాదు తనను గన్నుతో బెదిరించాడు అని ఆయన మూడో భార్య రమ్యరఘుపతి అంటుంది.. ఇక నేరుగా రంగంలోకి దిగిన పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర ఆమె కొంపలు కూల్చడం లో ముందుంటుంది అంటూ వైరల్ అవుతున్నాడు. ఇక ఇలా వీరి నలుగురి మధ్య వ్యవహారం జోరుగా కొనసాగుతుందని చెప్పవచ్చు.. పవిత్ర లోకేష్ , నరేష్ నిజంగానే పెళ్ళి చేసుకుంటున్నారా..? వారి మధ్య ఉన్న బంధం ఏమిటి? అనేది ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.

నిజానికి వీరిద్దరూ ఎక్కడ చూసినా.. జంటగా తిరుగుతూ ఉండడంతో నిజంగానే వీరిమధ్య ఏదో వుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విడాకులు ఇవ్వకుండా మళ్లీ ఎలా పెళ్లి చేసుకుంటాడు అని నరేష్ మూడో భార్య ఎంటర్ అయింది.. ఇలాంటి ఎదవ వేషాలు వేస్తోంది అని.. ఈమెకు ఏమైనా సమస్యలు ఉంటే హైదరాబాదులో తేల్చుకోవాలని.. కానీ ఇక్కడ బెంగళూరుకి వచ్చి నన్ను టార్గెట్ చేయడం మంచిది కాదు అని పవిత్ర లోకేష్ నిలదీశారు.. ఇక రమ్యారపతి మాట్లాడుతూ విడాకులు వద్దు అని అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. అయితే విడాకుల కోసం గన్ పెట్టి మరి నరేష్ బెదిరించాడు అంటూ పెద్ద బాంబు పేల్చింది రమ్య. ఈ విషయం అత్త విజయనిర్మల గారికి తెలుసు అని .. చనిపోయే చివరి రోజు కూడా ఆమెతో నాతో మాట్లాడింది అంటూ రమ్య చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఇంట్లోంచి వెళ్ళ వద్దంటూ నాతో ప్రమాణం కూడా చేయించుకుంది విజయనిర్మల అంటూ రమ్య రఘుపతి చెప్పుకొచ్చింది. ఇంకా నరేష్ , పవిత్ర లోకేష్ తో సహజీవనం చేయడం ఇష్టం లేదు.. నా సంసారాన్ని చక్కబెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ రమ్య రఘుపతి తెలిపింది. ఇక ఈ విషయంపై నరేష్ స్పందించి తనకు విడాకులు ఇచ్చే తీరుతాను అంటూ కూర్చున్నాడు . మరి ఈ వివాదం ఎంతవరకు దారి తీస్తుందో తెలియాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news