భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ..మరో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నవంబరు 29న పీఎస్ఎల్వీ-సీ 43 ద్వారా హైసిస్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇందుకుగాను 28 గంటల కౌంట్డౌన్ బుధవారం ఉదయం 5.59 గంటలకు ప్రారంభమైంది. గురువారం ఉదయం 9.59గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్నట్లు ఇస్రో చైర్మన్ కే. శివన్ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ద్వారా మన దేశానికి చెందిన హెచ్వైఎస్ఐఎస్ ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 30కిపైగా ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. వీటిలో చిన్న, నానో ఉపగ్రహాలసంఖ్యే అధికం. హెచ్వైఎస్ఐఎస్ ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలో 630 కిలోమీటర్ల దూరంలో భూమిపై రంగురంగుల చిత్రాలను చూసే అవకాశముంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర ప్రాంతాల అంచనా నీరు, మట్టి ఇతర భౌగోళిక పరిసరాలకు సంబంధించి సేవలను అందిస్తుందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
పీఎస్ఎల్వీ సీ – 43 కౌంట్ డౌన్ స్టార్ట్
-
Previous article
Read more RELATEDRecommended to you
తెలంగాణకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగింది: జేపీ నడ్డా
కేంద్రం పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసిందని బీజేపీ జాతీయ...
కర్ణాటక సెక్స్ స్కాండల్.. ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని విడిచి ఎలా వెళ్లగలిగాడు?: కేటీఆర్ ట్వీట్
సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న విదేశాలకు పారిపోవడంపై...
Nara Lokesh: రేపటి నుంచి యువగళం మళ్లీ ప్రారంభం
నారా లోకేష్ గత ఏడాది యువగలం పేరిట 3132 కిలోమీటర్ల మేర...