గుమ్మడి గింజలతో గర్భిణీలకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

-

గర్భం ధరించిన స్త్రీలు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సమయంలో ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తింటారు. ఎందుకంటే గర్భవతులు తీసుకునే ఆహారం లోపల శిశువు పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది అనే భయం వారిలో కలుగుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహార తీసుకుంటారు. అలాగే గర్భిణీ స్త్రీలు గుమ్మడి కాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.

గర్భం దాల్చిన స్త్రీలలో ముఖ్యంగా కనిపించే సమస్య జీర్ణక్రియ రేటు తగ్గిపోవడం, మలబద్ధకం, ఎసిడిటీ, అధిక రక్తపోటు ఇవి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యలు అన్నింటిని కూడా మనం ఈ గుమ్మడికాయ గింజలతో చెక్ పెట్టొచ్చు.

గుమ్మడి గింజలలో అధిక శాతం ఫైబర్, జింక్ మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ, బి, క్యాల్షియం, ఫ్యాటి ఆసిడ్లు మెండుగా ఉంటాయి.

గుమ్మడి కాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ రేటును మెరుగు పరచడంతో పాటు, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇందులో ఉన్న కాల్షియం, ఫ్యాటీ యాసిడ్లు ఎముకలను బలంగా చేకూరుస్తాయి అలాగే శిశువు పెరుగుదలకు ఉపయోగపడతాయి.

అంతేకాకుండా మహిళలు గుమ్మడి కాయ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ నుంచి కాపాడుతుంది.

గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు, చక్కెర స్థాయిలను తగ్గించడానికి గుమ్మడికాయ ఎంతో సహాయపడుతుంది.

ఇక ఇందులో ఉన్న జింక్ జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అయితే గుమ్మడికాయను స్వీట్లలో కాకుండా ప్రత్యేకంగా ఉడికించి తినడం మంచిదని అంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news