IPL 2021 : బ్యాటింగ్ లో తేలిపోయిన చెన్నై.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?

-

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరియు పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య కీలక మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే.. ఇందులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు… తడబడింది.20 ఓవర్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు 6 వికెట్లు కోల్పోయి కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌ మెన్లలో డూప్లిసిస్‌ తప్ప .. ఏ ఒక్క ఆటగాడు రాణించలేదు. డూప్లిసిస్‌ కేవలం 55 బంతుల్లో 76 పరుగులు చేసి.. జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ ను అందించాడు. గైక్వాడ్‌ 12 పరుగులు, మోయిన్‌ అలీ 0, ఉతప్ప 2 పరుగులు, రాయుడు 4 పరుగులు, ధోని 12 పరుగులు జడేజా 15 పరుగులు బ్రావో 4 పరుగులు చేశారు. ఇక పంజాబ్‌ బౌలర్లలో షమీ 1 వికెట్‌, అర్హదీప్‌ సింగ్‌ 2 వికెట్లు, క్రిష్‌ జోర్డాన్‌ 2 వికెట్లు తీసి… చైన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు చుక్కలు చూపించారు. ఇక ఈ మ్యాచ్‌ లో పంజాబ్‌ కింగ్స్‌ గెలవాలంటే.. 20 ఓవర్లలో 135 పరుగులు చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news