లైగర్ కి డబుల్ బడ్జెట్ తో జనగణమన.. క్రేజ్ అప్డేట్ ఇచ్చిన పూరి

-

లైగర్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాధ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. లైగర్‌ కు డబుల్‌ బడ్జెట్‌ తో జనగణమన చేస్తున్నామని.. లైగన్‌ ఉన్న కాన్ఫిడెన్స్‌ తోనే జనగణమనను భారీగా తీస్తున్నామని క్రేజీ అప్డేట్‌ ఇచ్చారు. లైగర్ సినిమా యాక్షన్ డ్రామా అని.. కుర్రోడ్ని తీసుకొని తల్లి ముంబాయి వెల్తుంది. బాక్సర్ ను తల్లి చేస్తుంది. మధ్యలో ప్రేమలో పడతాడు అది లైగర్ స్టోరీ అని వెల్లడించారు.

చిన్న పెద్ద అందరూ కలిసి సినిమా చూడొచ్చు.. అమ్మా, నాన్న తమిళమ్మాయి కి లైగర్ వేరే స్టోరీలు అని వివరించారు. లైగర్ లాంటి సినిమాను థియేటర్లలోనే చూడాలి..ఓటీటీ లో చూడాల్సిన సినిమా కాదన్నారు పూరి జగన్నాధ్‌.

ఇక అటు లైగర్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ సందర్భంగా హీరో విజయదేవర కొండ క్రేజీ వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల నుంచి లైగర్ సినిమా తీస్తున్నామని.. ఇంకా ఐదు రోజులు సినిమా విడుదలకు ఉందన్నారు. ఇవాల్టి నుంచి ఎపి, తెలంగాణా లో టిక్కెట్స్ ఓపెన్ అయ్యాయని.. ప్రాణం పెట్టి లైగర్ సినిమా తీశాం.. అందరికీ సినిమా నచ్చుతుందని వెల్లడించారు హీరో విజయ దేవరకొండ.

Read more RELATED
Recommended to you

Exit mobile version