చీర కట్టులో వయ్యారాలు వొలకబోస్తున్న పూర్ణ.. చీర ధర తెలిస్తే షాక్..!!

-

ప్రముఖ హీరోయిన్ నటి పూర్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఏ సినిమాలో అయినా సరే చిన్న రోల్ ఇచ్చిన కూడా తన నటనతో పరిపూర్ణం చేసే మంచి ప్రతిభావంతురాలు అని చెప్పవచ్చు. ఇక తన నటనతో.. పర్ఫెక్షన్ తో ప్రేక్షకులను మెప్పించే ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ లో కూడా ముందుండాలని అనుకుంటుంది. అందుకే ఆమె పర్ఫెక్ట్ బ్రాండ్లను ఎక్కువగా ఇష్టపడుతుంది.. ఈ క్రమంలోనే హైదరాబాదుకు చెందిన స్వాతి అవసరాల అనే సాఫ్ట్వేర్ ఇంజనీరు 2019లో పెటల్స్ బై స్వాతి అనే బ్రాండును ప్రారంభించింది. హాబీగా మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత జువెలరీ డిజైన్ ను సీరియస్ గానే తీసుకుంది.

ఇక అలా కుందన్ , జాదు , జిర్ఖాన్ జువెలరీ, గోల్డ్ ఇమిటేషన్, జ్యువలరీ ని తయారు చేయడంలో స్వాతి సిద్ధహస్తురాలుగా మారిపోయింది. ముఖ్యంగా సాంప్రదాయాలు కాకుండా ఇండో వెస్ట్రన్ పద్ధతిలో కూడా ఆభరణాలను డిజైన్ చేస్తోంది.Sakshi

ఇక అంతేకాదు భార్గవి కూనమ్ అనే బ్రాండ్ ను కూడా ఎక్కువగా ఇష్టపడుతుంది పూర్ణ. ఇక్కడ సాంప్రదాయ చేనేత చక్కటి రంగుల కలబోత తో తయారు చేసిన దుస్తులను ఎక్కువగా విక్రయిస్తారు. ఇక్కడ పరికిణి ఓని, బ్రైడల్ కలెక్షన్స్ , దుపట్టాలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు.ముఖ్యంగా మృదువైన ఫ్యాబ్రిక్ కూడా ఈ బ్రాండ్ కు వ్యాల్యూ ను యాడ్ చేస్తోంది. అందుకే ఆ ధరలను అందుకోగలిగిన వారి దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా భార్గవి కూనమ్ ఫేవరెట్ డిజైనర్ గా మారిపోయింది . ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్ చేసి.. ప్రకృతిలోని రంగులు ఆమెను పొడుగు పీకల వైపు నడిపించాయి.Sakshi

అందుకే ఈ రెండు బ్రాండ్లను ఎక్కువగా ఇష్టపడుతుంది పూర్ణ.. అంతేకాదు ఇటీవల ఆమె ఈ రెండు బ్రాండ్ల గురించి చెబుతూ చీరలు , చుడీదారులలో సౌకర్యంగా ఫీల్ అవుతాను. ముఖ్యంగా పండుగలు, ఫంక్షన్స్ వస్తే ఈ బ్రాండ్లనే ప్రిఫర్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది ఇకపోతే తాజాగా ఈమె ధరించిన చీర ధర తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. పెటల్స్ బై స్వాతి బ్రాండ్ నుంచి రూ.2,400 విలువైన కమ్మలు కొనుగోలు చేసింది. ఇక భార్గవి కూనం బ్రాండ్ నుంచి రూ.54 వేల విలువైన చీరను కొనుగోలు చేసి రెండింటిని ధరించి అందమైన లుక్కులో చూపర్లను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు పూర్ణను ఇలా చూసి మగువ లు సైతం ఆమె దుస్తులకు ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news