Pushpa: దీపావళికి ట్రీట్ ఇవ్వ‌నున్న ‘పుష్ప’రాజ్! ఆ ట్రీటెంటో తెలుసా?

-

Pushpa: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప టీం త‌న అభిమానులకు దీపావ‌ళి ట్రీట్ ఇవ్వ‌నున్నారు. పండుగ వేళ ఓ స్పెష‌ల్ ట్రీట్ కు ప్లాన్ చేస్తున్నారట‌. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప‌ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇవ్వ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ చిత్రం విడుద‌ల కాకముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్నారు. ఇదిగో వస్తున్నాం.. అదిగో వస్తున్నాం అని అంటూ అభిమానుల్లో పుష్ప ఫీవర్ తెప్పిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. అలాగే.. సినిమా నుంచి మూడు సింగిల్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. “దాక్కో దాక్కో మేక”, “శ్రీవల్లి”, “సామీ సామీ” విడుదల చేసారు. వీటికి అభిమానుల నుంచి మంచి రెస్ఫాన్స్ వ‌చ్చింది. గ‌త రిక్డార్ల‌ను బ‌ద్ద‌లు కొట్టి .. స‌రికొత్త‌ రికార్డ్ క్రియేట్ చేశాయి.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తన్నారు. గతంలో కూడా డిఎస్పీ, సుకుమార్, అల్లు అర్జున్ కాంబో లో వ‌చ్చిన ఆర్య, ఆర్య 2 చిత్రాలు ఎలాంటి మ్యూజికల్ గా సూపర్ హిట్ నిలుచావో అంద‌రికీ తెలుసు. ఇదిలా ఉండగా తాజాగా “పుష్ప”రాజ్ అభిమానులకు దీపావళి ట్రీట్ ఇవ్వబోతున్నాడట. నవంబర్ 4న పుష్ప‌ టీజర్‌ను విడుదల చేయాలనే భావిస్తున్నార‌ట మూవీ యూనిట్. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్. “పుష్ప: ది రైజ్” ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. నవంబర్ లో షూటింగ్ పూర్తి చేసుకుని.. డిసెంబర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల చేయ‌నున్నారు.

ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జంట‌గా రష్మిక మందన్న న‌టించ‌నున్న‌ది. అలాగే.. ఫహద్ ఫాసిల్, సునీల్ ప్రధాన పాత్రల్లో న‌టించ‌నున్నారు. ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news