ఏపీ మంత్రుల వ్యాఖ్య‌లు బాధాక‌ర‌మ‌న్న పువ్వాడ‌

-

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. వ‌రద నివార‌ణ చ‌ర్య‌ల‌కు గాను ఏపీలో విలీనం అయిన 7 మండ‌లాల్లోని 5 గ్రామాల‌ను తిరిగి తెలంగాణ‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై ముందుగా ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఆ త‌ర్వాత ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబులు మండిపడ్డారు. బొత్స, అంబ‌టి వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకుమ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చారు పువ్వాడ అజ‌య్. ఈ సందర్భంగా పువ్వాడ అజ‌య్ మాట్లాడుతూ.. ఏపీ మంత్రులు బొత్స‌, అంబ‌టి వ్యాఖ్య‌లు బాధాక‌ర‌మ‌న్నారు. అస‌లు తాను మాట్లాడిన దానిలో తప్పేముందో కూడా త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్న పువ్వాడ అజ‌య్.. వ‌ర‌ద‌ల‌కు భ‌ద్రాచ‌లంతో పాటు అక్క‌డి ప్ర‌జ‌లు కూడా ముంపున‌కు గురి కాకూడ‌ద‌న్న‌దే త‌మ అభిమ‌త‌మ‌న్నారు.

వ‌రద నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా క‌ర‌క‌ట్టల నిర్మాణానికే 5 గ్రామాల‌ను ఇవ్వాల‌ని కోరుతున్నామ‌ని పువ్వాడ అజ‌య్ తెలిపారు. సున్నిత‌మైన అంశాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాల‌ని, హైద‌రాబాద్ ఇస్తారా అనడం అసంద‌ర్భమే కాకుండా అర్థ‌ర‌హిత‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పువ్వాడ అజ‌య్. భ‌ద్రాద్రి రాముడు వ‌ర‌ద నీటిలో మునిగితే ఏపీ ప్ర‌జ‌ల‌కైనా బాధే క‌దా అని ఆయ‌న వ్యాఖ్యానించారు పువ్వాడ అజ‌య్. కేసీఆర్‌తో జ‌గ‌న్ చ‌ర్చ‌లకు బొత్స‌, అంబ‌టిలు కృషి చేయాల‌ని, జ‌గన్‌తో వారిద్ద‌రూ చ‌ర్చించి 5 గ్రామాల‌ను తెలంగాణ‌కు ఇప్పించాల‌ని పువ్వాడ అజ‌య్ వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version