స్టీల్ ప్లాంట్ పై మరోసారి గొంతెత్తిన‌ ఆర్.నారాయణ మూర్తి

-

విశాఖ:- ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వంగపండు ప్రసాద రావు ప్రథమ వర్ధంతి సభ జరిగింది..ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలంకి చెందిన బాడ సూరన్నకి వంగపండు పురస్కారం అందించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఈ సందర్భంగా సినీ నటుడు R.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ప్రజల గుండెలలో ఉన్న వ్యక్తి వంగపండు అని.. గద్దరన్నను డీ అంటే డీ అన్న ఏకైక మహా కవి వంగపండు అని పేర్కొన్నారు.

వంగపండు గొప్ప నాటక రచయిత కూడా…అడవి దివిటీలు అనే మంచి నాటకాన్ని ఆయన రాశారని వెల్లడించారు. వంగపండు, గద్దర్, గోరేటి వెంకన్న లు ప్రజా సమస్యలపై గొంతెత్తిన గొప్ప ప్రజా గాయకులు అని చెప్పారు. వంగపండు బ్రతికి ఉంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆడి, పాడి బీభత్సంగా ఉద్యమించే వారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం అందరూ ఒక్కటై గొంతు విప్పారు… అన్ని పార్టీలు పోరాడుతున్నాయని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటికరించకుండా చూడటమే వంగపండుకి ఇచ్చే అసలు సిసలు నివాళి అని పేర్కొన్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version