అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన రెడ్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్‌..

-

చైనీస్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ షియోమి తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. అదిరిపోయే ఫీచర్లతో రెడ్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. చైనా మార్కెట్‌లో రెడ్‌మి కే30, రెడ్‌మి కే30 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ వెల్లడించింది. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మి కే30 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 20,100, 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మి కే30 4జీ స్మార్ట్‌ఫోన్ రూ. 16,100 ఉంటుంది.

ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.. మొదటి రౌటర్, రెడ్‌మి స్మార్ట్ స్పీకర్స్, 4జీ, 5జీ వేరియంట్‌లో ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు షియోమి ప్రకటించింది. హోల్-పంచ్ డిస్‌ప్లే, డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు, రియర్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ కెమెరా, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news