ఎమ్మెల్సీ ఫలితాలు చూస్తుంటే..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు – రఘురామ

-

ఎమ్మెల్సీ ఫలితాలు చూస్తుంటే..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు రఘురామ కృష్ణం రాజు. తూర్పు రాయలసీమ పరిధిలోని ఒంగోలు, నెల్లూరు జిల్లాల టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గారు విజయం దిశగా ముందుకు సాగుతున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎదురు ఈదడం పరిశీలిస్తే, వై నాట్ 175 ఎటు పోయిందని ప్రశ్నించారు.

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యే అవకాశాలు లేకపోలేదని, ఒక పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ప్రజలు విజ్ఞతతో వ్యవహరించడం శుభ పరిణామం అని అన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో అరాచకాలు విజృంభిస్తాయని, పోలీసులలో చైతన్యం, మార్పు వస్తుందని, స్వీయ రక్షణతో పాటు, ప్రజల్లో మార్పు కోసం పట్టభద్రులు కృషి చేయాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు. వై నాట్ 175 అన్నది కేవలం పిచ్చి ప్రేలాపనేనని రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news