స్పీకర్ ను అవమానించింది ప్రశాంత్ రెడ్డినే – దుబ్బాక ఎమ్మెల్యే

-

స్పీకర్ ను అవమానించింది ప్రశాంత్ రెడ్డినే – దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. మొన్న నిజామాబాద్ లో ప్రశాంత్ రెడ్డి నీకు స్పీకర్ కు మధ్య జరిగింది ఏందో ఒక సారి చెప్పు అని చురకలు అంటించారు. ఏదో కారణం తో సభ నుండి బయటకు పంపించాలి అని చూస్తున్నారని…సమస్యల మాట్లాడకుండా గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు.

20 రోజుల సభ జరగక పోతే మేము సభకు రామని భట్టి ఎందుకు డిమాండ్ చేయలేదు… బిజెపి నీ ఆహ్వానించాలని MIM ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఎవరినో వ్యక్తిగతంగా అవమానించాలని మాకు లేదని వెల్లడించారు.

సర్దుకునే లోపే అసెంబ్లీ ప్రారంభం అయ్యింది… వాయిదా పడింది…బీఏసీ మీటింగ్ కి మమ్మల్ని అహ్వానించక పోవడం పై స్పీకర్ ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. గతం లో ఒకరు, ఇద్దరు సభ్యులు గా ఉన్న పార్టీ లను bac మీటింగ్ కి పిలిచారు…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ పిలిచారు..సభ గౌరవాన్ని పెంచాలని విజ్ఞప్తి కోరామని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news