ORR మీద రాహుల్ గాంధీ యాత్ర వల్ల ఉపయోగం లేదు – జగ్గారెడ్డి

-

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి నియోజక వర్గంలో 30 కిలోమీటర్లు ఉంటుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. యాత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు…స్వాగతం పలికేందుకు ప్రజల్ని ఎక్కువ భాగస్వామ్యం చేస్తామన్నారు. పెట్రో, గ్యాస్ ధరల భారం, అన్ని వర్గాల ప్రజలను రాహుల్ గాంధీ యాత్రలో భాగస్వామ్యం చేస్తామన్నారు. దీనిపై ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తున్నామన్నారు.

ఇవాళ గాంధీ భవన్ లో సమావేశం కి హాజరవుతానన్నారు జగ్గారెడ్డి. నియోజక వర్గం కి చెందిన పాదయాత్ర పై క్లారిటీ తీసుకుంటానన్నారు. శంషాబాద్ నుండి ముత్తంగి వరకు orr మీద యాత్ర వల్ల ఉపయోగం లేదన్నారు. అదే రోడ్డులో కంటే..రాజేంద్ర నగర్, మేహిదిపట్నం , గచ్చిబౌలి.. పఠాన్ చేరు.. సంగారెడ్డి మీదుగా వెళ్ళతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై పిసిసి తో మాట్లాడతానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news