లవ్‌ మ్యారేజ్‌ చేసుకోనున్న టీమిండియా క్రికెటర్లు

-

భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి గుడ్ న్యూస్ చెప్పింది. కర్ణాటక బ్యాటర్ అర్జున్ హోయసలతో తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రకటించింది. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఇద్దరు క్రికెటర్లు ఒకరినొకరు వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. హోయసల తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కృష్ణమూర్తిని ట్యాగ్ చేస్తూ ప్రపోజల్ ఫోటో పెట్టగా, ఎస్ అంటూ వేద రిప్లై ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి.

కర్ణాటకకు చెందిన వేద కృష్ణమూర్తి టీమిండియా ఉమెన్స్ తరఫున మొత్తం 48 వన్డేలు, 76 టీ 20 లు ఆడింది. ఇంగ్లాండులో జరిగిన 2017 మహిళల వన్డే ప్రపంచ కప్, అలాగే 2020 మహిళల టీ 20 ప్రపంచ కప్ లో ఫైనల్ కు చేరిన భారత టీం లో ఆమె సభ్యురాలు. ఇకపోతే రంజి ప్లేయర్ అర్జున్ హోయసల 2016లో మహారాష్ట్రతో మొహాలీలో జరిగిన మ్యాచ్ లో కర్ణాటక రంజి ట్రోఫీ జట్టుకు గొప్ప ప్రదర్శన ఇచ్చాడు. అతను చివరిసారిగా 2019 సీజన్ లో శివమొగ్గ లయన్స్ తరఫున కర్ణాటక ప్రీమియర్ లీగ్ లో తలపడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news