రాహుల్ గాంధీవి పిల్ల చేష్టలు… అమిత్ షా సెటైర్

-

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. ఇది జిహాద్‌కు, అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికగా అభివర్ణించారు అమిత్ షా. కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునే పార్టీకి ఓటేస్తారో.. దేశాభివృద్ధికి పాటుపడే పార్టీకి ఓటు వేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీవి పిల్ల చేష్టలు అని.. ఆయన గ్యారంటీలను ఎవరూ నమ్మరని అమిత్ షా సెటైర్స్ వేశారు.

మొదటి మూడు విడతల్లో బీజేపీ 200 సీట్లు సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.తెలంగాణలో బీజేపీ 10 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని, దేశవ్యాప్తంగా ఈసారి 400 సీట్లు సాధిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య ట్రయాంగిల్ బంధముందని, ఈ మూడు పార్టీలు కలిసి రామనవమి ఊరేగింపు కూడా జరగనివ్వవని మండిపడ్డారు అమిత్ షా. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news